NBK 109 ఫిక్స్ !

నట సింహం నందమూరి బాలకృష్ణ  వరస సినిమాలతో దూకుడు మీదున్నారు. ప్రస్తుతం గోపీచంద్‌ మలినేని దర్శకత్వంలో ‘వీరసింహారెడ్డి’ని పూర్తి చేసే పనిలో ఉన్నారు. ఆ తర్వాత  బాలకృష్ణ 108వ సినిమాని అనిల్‌ రావిపూడి తెరకెక్కించనున్నారు. మరి 109వ చిత్రానికి పరశురామ్‌ దర్శకత్వం వహించనున్నారని సమాచారం.

ఇటీవల ఓ వేడుకలో ‘మిమ్మల్ని వచ్చి త్వరలోనే కలుస్తాను. ఓ అద్భుతమైన కథను సిద్ధం చేశాను. ఆ విషయం నిర్మాత అల్లు అరవింద్‌గారికి కూడా తెలుసు’’అని చెప్పారు పరశురామ్‌. దీంతో 109వ సినిమాకి ఆయనే దర్శకుడని అభిమానులు ఖుషీ అవుతున్నారు.