పార్టీ చేరాలంటూ కవితపైనా బీజేపీ ఒత్తిడి

తెలంగాణ సీఎం కేసీఆర్ సంచలన విషయాలు బయట పెట్టారు. బీజేపీ చాలా నీచంగా వ్యవహరిస్తోందన్న కేసీఆర్.. నా కూతురు, ఎమ్మెల్సీ కవితను కూడా పార్టీలో చేరాలని బీజేపీ ఒత్తిడి చేసిందన్నారు.  మంగళవారం తెలంగాణ భవన్‌లో జరిగిన తెరాస విస్తృతస్థాయి  సమావేశంలో సీఎం కేసీఆర్‌ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ముందస్తు ఎన్నికలపై క్లారిటీ ఇచ్చారు. ముందస్తుకు వెళ్లే ఆలోచన లేదు. షెడ్యూల్‌ ప్రకారమే అసెంబ్లీ ఎన్నికలు జరుగుతాయన్నారు. 

ప్రభుత్వాలను కూలగొట్టేందుకు భాజపా నేతలు ప్రయత్నిస్తున్నారు. మన దగ్గర కూడా ప్రయత్నించి అడ్డంగా దొరికారు. ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారం కేసులో చట్టం తనపనితాను చేస్తోంది. బీజేపీ కుట్రలు అన్నింటినీ తిప్పికొడదాం. సీబీఐ, ఈడీ దాడులకు భయపడాల్సిన అవసరం లేదు. ఎమ్మెల్సీ కవితను కూడా పార్టీలో చేరాలని భాజపా ఒత్తిడి చేసింది అని కేసీఆర్‌ చెప్పుకొచ్చారు.