కిసీ కా భాయ్ కిసీ కి జాన్.. సల్మాన్ సూపర్ కూల్

బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ హీరోగా ఫర్హాద్ సామ్జీ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న సినిమా ‘కిసీ కా భాయ్ కిసీ కి జాన్’. పూజా హెగ్డే హీరోయిన్. విక్టరీ వెంకటేష్, జగపతి బాబు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. 2014 తమిళ చిత్రం వీరమ్ ఆధారంగా రూపొందించబడింది. సల్మాన్ ఖాన్ ఫిల్మ్స్ నిర్మిస్తున్న ఈ సినిమా వచ్చే ఏడాది ఈద్ కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుంది.

తాజాగా ఈ సినిమా షూటింగ్ పూర్తయింది. ఈ విషయాన్ని స్వయంగా సల్మాన్ ఖాన్ తెలిపారు. ఓ సరికొత్త ఫోటోను తన ట్విట్టర్ ఖాతాలో షేర్ చేసిన సల్మాన్ భాయ్  ‘కిసీ కా భాయ్ కిసీ కి జాన్’ పూర్తయింది. 2023 ఈద్ కానుకగా  ప్రేక్షకుల ముందుకు రానుందని అప్ డేట్ ఇచ్చారు.