బాలయ్య ఫ్యాన్స్ కు కిక్కునిచ్చే న్యూస్ చెప్పిన థమన్

బాలయ్య అభిమానులకు సంగీత దర్శకుడు థమన్ సూపర్ న్యూస్ చెప్పారు. గోపీచంద్ మలినేని దర్శకత్వంలో బాలయ్య హీరోగా ‘వీరసింహారెడ్డి’ తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. శృతిహాసన్ హీరోయిన్. థమన్ సంగీతం అందిస్తున్నారు. సంక్రాంతి కానుకగా జనవరి 12న వీరసింహారెడ్డి ప్రేక్షకుల ముందుకు రాబోతున్న సంగతి తెలిసిందే.

తాజాగా ఈ సినిమాకు సంబంధించి థమన్ మేజర్ అప్ డేట్ ఇచ్చారు. ఇప్పటికే పాటలన్నీ అయిపోయాయి. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ పనులు షూరు చేశామని చెప్పారు. దర్శకుడు గోపీ, గేయ రచయిత రామజోగయ్య శాస్త్రి తో కలిసి దిగిన ఫోటో ఒకటి తన ట్విట్టర్ ఖాతాలో షేర్ చేశారు.