రెండో వన్డే : బంగ్లా 79/6 (21 ఓవర్లు)

మిర్పూర్‌ వేదికగా భారత్‌-బంగ్లా మధ్య రెండో వన్డేలో భారత బౌలర్లు అద్భుతంగా బౌలింగ్ చేస్తున్నారు. టాస్ గెలిచి మొదటి బ్యాటింగ్ చేస్తున్న బంగ్లా 21 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 76 పరుగులు చేసింది. 18వ ఓవర్‌ను ఉమ్రాన్‌ మాలిక్ మెయిడిన్‌ ఓవర్‌గా వేశాడు.

మరోసారి వాషింగ్టన్‌ సుందర్ బౌలింగ్‌లో ముష్ఫికర్‌ (12) ఇచ్చిన క్యాచ్‌ను ధావన్ అద్భుతంగా ఒడిసిపట్టాడు. అయితే అంపైర్‌ తొలుత నాటౌట్‌గా ప్రకటించాడు. డీఆర్‌ఎస్‌కు వెళ్లిన భారత్‌కు సమీక్షలో పాజిటివ్‌గా ఫలితం వచ్చింది. 
అనంతరం వచ్చిన అఫిఫ్‌ (0)ను సుందర్‌ క్లీన్‌బౌల్డ్‌ చేశాడు. ప్రస్తుతం 21 ఓవర్లు ముగిసేసరికి బంగ్లా స్కోరు 79/6.  క్రీజ్‌లో మహముదుల్లా, మెహిదీ ఉన్నారు. ఇప్పటి వరకు సుందర్ 3, సిరాజ్ 2, మాలిక్ 1 వికెట్ పడగొట్టారు.