యాదాద్రి శివాల‌య అంత‌రాల‌య ద్వార పూజ‌..

యాదాద్రి ఆల‌య పున‌ర్నిర్మాణ ప‌నులు శ‌ర‌వేగంగా జ‌రుగుతున్నాయి. ప్ర‌ధాన ఆల‌యంతో గోపుర నిర్మాణ ప‌నులు కొన‌సాగుతున్నాయి. అష్ట‌భుజి ఆకృతిలో బాహ్య ప్రాకార ప‌నులు, శిల్పాల అమ‌రిక ప‌నుల్లోవేగం పెంచారు అధికారులు. ఆల‌య ముఖమండ‌పం ప‌నులు తుది రూపుకు వ‌చ్చాయి. యాదాద్రి ప్ర‌ధాన ఆల‌య ప‌నుల‌తో పాటు కొండ‌పై ఉన్న శివాల‌య ప‌నులు కూడా శ‌ర‌వేగంగా జ‌రుగుతున్నాయి.

యాదాద్రి కొండ‌పై ఉన్న శివాల‌యానికి సంబంధించి గ‌తంలోనే ప‌నులు ప్రారంభ‌మ‌య్యాయి. శివాల‌యంలో సోమ‌వారం నూత‌న అంత‌రాల‌య ద్వార పూజ నిర్వ‌హించారు. ఈ కార్య‌క్ర‌మంలో వైటీడీఏ వైస్ చైర్మ‌న్ కిష‌న్ రావు, ఆల‌య ఈవో గీత పాల్గొన్నారు.