మూడో టీ20.. మార్పులివే !

మూడు మ్యాచ్ ల టీ20 సిరీస్ లో శ్రీలంక, భారత జట్లు ఇప్పటి వరకు చెరో మ్యాచ్ గెలిచిన సంగతి తెలిసిందే. టైటిల్ ను డిసైడ్ చేసే ఆఖరి టీ20 మ్యాచ్ ఈరోజు జరగనుంది.

టాప్ ఆర్డర్ ఫెయిల్.. పేసర్ల నో బౌల్స్, కెప్టెన్ గా హార్దిక్ తప్పిదాలు వెరసి.. రెండో మ్యాచ్ లో టీమిండియా మూల్యం చెల్లించుకున్న సంగతి తెలిసిందే. ఐతే ఆఖరి మ్యాచ్ లో ఎలాంటి తప్పిదాలు చేయకుండా మ్యాచ్ ను గెలవాలని భావిస్తోంది. ఇందుకోసం ఒకట్రెండు మార్పులు చేయనున్నట్లు తెలుస్తోంది.

గత రెండు మ్యాచ్ లలో విఫలమైన ఓపెనర్ శుభమన్ గిల్ స్థానంలో రుతురాజ్‌ గైక్వాడ్ వచ్చే అవకాశాలున్నాయి. దీపిక్ హూడాకు అవకాశం రావొచ్చు. పేసర్ అర్షదీప్ ను ఆడించాలని నిర్ణయం తీసుకున్నట్లు టాక్.  

తుది జట్లు అంచనా – భారత్:  ఇషాన్‌ కిషన్ (వికెట్ కీపర్), రుతురాజ్‌ గైక్వాడ్, సూర్యకుమార్‌ యాదవ్, రాహుల్‌ త్రిపాఠి, హార్దిక్ పాండ్య (కెప్టెన్), దీపక్ హుడా, అక్షర్ పటేల్, శివమ్‌ మావి, ఉమ్రాన్‌ మాలిక్, అర్ష్‌దీప్‌ సింగ్, యుజ్వేంద్ర చాహల్‌

శ్రీలంక :  పాతున్ నిస్సాంక, కుశాల్ మెండిస్ (వికెట్ కీపర్), ధనంజయ డిసిల్వా, చరిత్ అసలంక, భానుక  రాజపక్స, డాసున్ శనక (కెప్టెన్), వనిందు హసరంగ, చమిక కరుణరత్నె, మహీశ్‌ తీక్షణ, కాసున్ రజిత, దిల్షాన్ మదుషంక