వారికి పంత్ కృతజ్ఞతలు

టీమిండియా క్రికెటర్ రిషభ్ పంత్‌ ఇటీవల రోడ్డు ప్రమాదానికి గురైన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ముంబయిలో చికిత్స పొందుతున్న పంత్ వేగంగా కోలుకుంటున్నారు.

ఈ క్రమంలోనే ప్రమాదానికి గురైన తర్వాత తనకు మద్దతుగా నిలిచిన బీసీసీఐకి, అభిమానులకు, వైద్యులకు, ప్రభుత్వ అధికారులకు కృతజ్ఞతలు తెలుపుతూ ట్వీట్‌ చేశాడు. “నా వెన్నంటే ఉన్న బీసీసీఐకి, జై షాకు, ప్రభుత్వ అధికారులకు ధన్యవాదాలు. ముఖ్యంగా నన్ను ఆస్పత్రికి తరలించడంలో సహాయపడిన రజత్‌ కుమార్‌, నిషు కుమార్‌లకు ధన్యవాదాలు. నేను ఎప్పటికీ మీకు రుణపడి ఉంటాను” అని పంత్‌ రాసుకొచ్చాడు.