‘వారసుడు’ టెలివిజన్ ప్రీమియర్ డేట్ ఫిక్స్

టాలీవుడ్ దర్శకుడు వంశీ పైడిపల్లి దర్శకత్వంలో కోలీవుడ్ స్టార్ విజయ్ నటించిన సినిమా ‘వారిసు/వారసుడు’. రష్మిక మందన హీరోయిన్. సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ బాక్సాఫీస్ వద్ద అదరగొడుతోంది. ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా వారసుడు కలెక్షన్స్ రూ. 200 కోట్లు దాటిపోయాయి. యూఎస్, యూకే బాక్సాఫీస్ వద్ద 2 మిలియన్ మార్క్ అందున్నాయి. దీంతో.. వారసుడు చిత్రబృందం ఆనందంలో మునిగితేలుస్తోంది.

మరోవైపు వారసుడు డిజిటల్ రైట్స్ ఇప్పటికే అప్పుడుపోయిన సంగతి తెలిసిందే. అమెజాన్ ప్రైమ్ ఓటీటీ హక్కులను సొంతం చేసుకుంది. తాజాగా ఈ సినిమా వరల్డ్ టెలివిజయ్ ప్రీమియర్ డేట్ కూడా వచ్చేసింది. ఏప్రిల్ 14న వారసుడు సన్ టీవీలో ప్రసారం కాబోతున్నాడు. ఈ మేరకు చిత్రబృందం నుంచి న్యూస్ బయటికు వచ్చింది. అయితే అధికారిక ప్రకటనలు రావాల్సి ఉంది.