అందుకే తారకరత్న ను బెంగళూరు కు తరలింపు !

నటుడు తారకరత్న తీవ్ర అనారోగ్యానికి గురయ్యారు. నారా లోకేశ్‌ చేపట్టిన ‘యువగళం’ పాదయాత్రలో పాల్గొన్న తారకరత్న సొమ్మసిల్లి పడిపోయారు. ఆయన్ని వెంటనే  కుప్పంలోని కేసీ ఆస్పత్రికి తరలించి ప్రాథమిక చికిత్స అందించారు. అనంతరం పట్టణంలోని పీఈఎస్‌ వైద్యకళాశాల ఆస్పత్రికి తరలించారు. హార్ట్ స్ట్రోక్ వచ్చినట్లు చెబుతున్నారు. అంతేకాదు.. ఆయన బాడీ పచ్చగా మారింది. పల్స్ పని చేయడం లేదని సమాచారం. 

ఈ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో తారకరత్న ఆరోగ్యంపై బాలయ్య స్పందించారు. తారకరత్న ఆరోగ్య పరిస్థితి  నిలకడగానే ఉందన్నారు. ప్రస్తుతం తారకరత్న బీపీ 120/80 చూపిస్తుంది. గుండెలో ఎడమవైపు 90 శాతం బ్లాక్‌ అయింది. ఇక్కడి వైద్యులు తీవ్రంగా కృషి చేస్తున్నారు.  బెంగళూరు తీసుకెళ్తే బాగుంటుందని వైద్యులు సూచించారని చెబుతున్నారు. గుండెలో ఎడమవైపు 90 శాతం బ్లాక్‌ కావడంతో.. మరోసారి స్ట్రోక్ వస్తే ప్రమాదం అని.. అందుకే త్వరగా బెంగళూరు తరలించాని డాక్టర్లు చెప్పినటు తెలుస్తోంది.