తారకరత్న తాజా హెల్త్ బులిటెన్

బెంగళూరులోని నారాయణ హృదయాలయ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న తారకరత్న ఆరోగ్య పరిస్థితి ఇంకా విషమంగానే ఉంది. కానీ ఆయన కోలుకుంటున్నారు అని నందమూరి ఫ్యామిలీ ఆదివారం చెప్పిన సంగతి తెలిసిందే. డాక్టర్లు మాత్రం మరిన్ని పరీక్షలు చేసిన తర్వాతే ఓ స్పష్టత వస్తుందని చెప్పినట్లు సమాచారం.

కర్ణాటక ఆరోగ్యశాఖ మంత్రి కె.సుధాకర్‌ ఆదివారం తారకరత్న ఆరోగ్య పరిస్థితిని సమీక్షించారు. ఆయన గుండె స్పందన సాధారణంగా ఉన్నా మెదడు పనితీరు సాధారణ స్థితిలో లేదని ఆయన పేర్కొన్నారు. గుండెపోటు వచ్చిన తర్వాత 30 నిమిషాలపాటు రక్త ప్రసరణ నిలిచిపోవడంతో మెదడు పనితీరుపై ప్రభావం పడినట్లు పరీక్షల ద్వారా గుర్తించామని తెలిపారు. తారకరత్న ఆరోగ్య పరిస్థితిపై సోమవారం మధ్యాహ్నం తర్వాత ఆస్పత్రి వైద్యులు హెల్త్‌ బులెటిన్‌ విడుదల చేయనున్నారు.