నటుడు, దర్శకుడు సతీశ్‌ కౌశిక్‌ ఇకలేరు. గుండెపోటుతో కన్నుమూత

బాలీవుడ్ లో విషాదం చోటు చేసుకుంది. ప్రముఖ నటుడు, దర్శకుడు సతీశ్‌ కౌశిక్‌ గుండెపోటుతో కన్నుమూశారు. హోలీ వేడుకల కోసం ఢిల్లీలో ఉన్న స్నేహితుడి ఇంటికి వెళ్లిన ఆయన గురువారం తెల్లవారుజామున హార్ట్ ఎటాక్ తో తుదిశ్వాస విడిచారు.

ఒంట్లో నలతగా అనిపించడంతో డ్రైవర్ తో కలిసి కారులో హాస్పిటల్ కి బయలు దేరిన ఆయన మార్గమధ్యంలో చనిపోయినట్లు తెలుస్తోంది. సతీశ్‌ కౌశిక్‌ మృతిపట్ల పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు సంతాపం తెలియజేశారు. ‘రూప్‌ కీ రాణీ చోరోన్‌ కా రాజా’, ‘ప్రేమ్‌’, ‘తేరే నామ్‌’, ‘షాదీ సే పెహ్లే’ వంటి చిత్రాలకు సతీశ్‌ దర్శకత్వం వహించారు. ‘ఉత్సవ్‌’, ‘సాగర్‌’, ‘మిస్టర్‌ ఇండియా’, ‘రాజాజీ’, ‘భాఘి 3’ వంటి చిత్రాల్లో కీలకపాత్రలు పోషించి నటుడిగానూ మెప్పించారు.