ఇక సమంతని వదిలేసినట్టే.. !!

స్టార్ హీరోయిన్ సమంత త్వరలోనే సినిమాలకు గుడ్ బై చెప్పనున్నట్టు జోరుగా ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే చేతిలో ఉన్న సినిమాలన్నీ సామ్ పూర్తి చేసింది. చైతూ కోసం ఎదురు చూస్తోంది. ‘నిన్నుకోరి’ దర్శకుడు శివ నిర్వాణ చైతూ-సామ్ జంటగా ఓ సినిమా తీయనున్నాడు. ఈ ఒక్క సినిమా పూర్తి చేసిన తర్వాత సామ్ సినిమాలకు దూరం కానుందనే ప్రచారం జరుగుతోంది. సమంత చేతిలో మరో సినిమా లేకపోవడం ఈ ప్రచారానికి మరింత బలం చేకూర్చింది. ఐతే, ఇప్పుడు కొత్త సినిమాని ఓకే చేసి.. ఈ ప్రచారానికి తెరదించింది సామ్.

అర్జున్ రెడ్డి’ దర్శకుడు సందీప్ వంగా శిష్యుడు గిరిశయ్య సమంతకు ఓ కథ చెప్పి.. ఒప్పించాడు. ఇది హాలీవుడ్‌లో హిట్టయిన థ్రిల్లర్ మూవీ ‘కొలాటెరల్’ ఆధారంగా రెడీ చేసుకొన్న కథ అని తెలిసింది. ఉత్కంఠభరితంగా సాగే థ్రిల్లర్ మూవీ కావడంతో స్టోరీ విన్న వెంటనే సమంత ఓకే చేసింది. త్వరలోనే ఈ సినిమాకు సంబంధించిన అధికారిక ప్రకటన రానుంది.

ఈ సినిమా ఒప్పేసుకొని సమంత అభిమానులకు గుడ్ న్యూస్ చెప్పినట్టయ్యింది. హమ్మాయ్యా.. సామ్ సినిమాలకు దూరం కావడం లేదు. మరో సినిమాని కూడా ఓకే చేసిందని అబిమానులు మురిసిపోతున్నారు. ఇకపై సమంత సినిమాలకు దూరం కానుందన్న ప్రచారానికి తెరపడినట్టే. ఇక, చైతూ-సామ్ సినిమా ఈ యేడాదియే ప్రేక్షకుల ముందుకు వెళ్లనుంది.