తిరుమలకు మోత్కుపల్లి.. టార్గెట్ చంద్రబాబు !

టీడీపీ బహిష్కరించబడిన సీనియర్ నేత మోత్కుపల్లి నర్సింహులు తిరుపతి చేరుకొన్నారు. కాలినడకన వెళ్లి శ్రీవారిని దర్శించుకొన్నారు. అంతకుముందు హైదరాబాద్ నుంచి తిరుపతి వెళ్లిన మోత్కుపల్లిని రేణిగుంట విమానాశ్రయంలో పలువురు నేతలు స్వాగతం పలకారు.
ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన మోత్కుపల్లి ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుపై నిప్పులు చెరిగారు.

ఎన్టీఆర్ దయతో రాజకీయాల్లోకి వచ్చా. పార్టీ సిద్ధాంతాలతో పనిచేస్తుంటే.. చంద్రబాబు నడి బజార్లో తన గొంతు కోశేశారు. మానసికంగా చంపేశారని ఆవేదన వ్యక్తం చేశారు. తనను అనారోగ్య సమస్యలు వెంటాడుతున్నా.. అవన్నీ లెక్క చేయకుండా కాలినడక వెంకన్నను దర్శించుకొని చంద్రబాబు ఓడిపోవాలని మొక్కుకుంటానని చెప్పారు.

వచ్చే ఎన్నికల్లో చంద్రబాబుని దెబ్బ తీయాలనే ఉద్దేశంతో మోత్కుపల్లి రాజకీయాలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ఆయన చంద్రబాబు ప్రత్యర్థులతో కలిసి పని చేస్తున్నారు. చంద్రబాబుకు వ్యతిరేకంగా ఏపీలోనూ పర్యటిస్తానని మోత్కుపల్లి చెప్పిన సంగతి తెలిసిందే. తాజాగా, శ్రీవారి దర్శణానికి వెళ్లిన మోత్కుపల్లి అదే పనిలో ఉన్నట్టు తెలుస్తోంది.