ఫ్యామిలీతో కలిసి మహేష్ ఫారిన్ టూర్.. ఎక్కడికి వెళ్లారో తెలుసా ?

సూపర్ స్టార్ మహేష్ బాబు ఫ్యామిలీ పర్సన్ అన్న విషయం తెలిసిందే. సినిమాలు లేకపోతే పూర్తి సమయాన్ని ఫ్యామిలీతో గడుపుతుంటారు. కుటుంబానికి సడన్ సప్రైజెస్ ఇస్తూ ఫారిన్ టూర్ లకి తీసుకెళ్తుంటారు. ఈ విషయాలను పలు ఇంటర్వ్యూల్లో నమ్రత చెప్పిన సంగతి తెలిసిందే. ఇక ప్రతి వేసవిలో ఫ్యామిలీతో కలిసి మహేష్ ఫారిన్ టూర్ ఉంటుంది.

తాజాగా మహేష్ ఫ్యామిలీతో కలిసి ఫ్లైట్ ఎక్కారు. దీనికి సంబంధించిన వీడియోలు, ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఎక్కడికి వెళ్లారు.. ? ఎన్నిరోజుల ట్రిప్ ? తదితర డిటేల్స్ ఏమీ తెలియవు. కానీ.. మహేష్ హాలీడే ట్రిప్ లో ఉన్నారు. 

మరోవైపు మహేష్ – త్రివిక్రమ్ సినిమా ఆగిపోయింది అనే పుకార్లు ఇటీవల వినిపిస్తున్నాయి. మహేష్-త్రివిక్రమ్ ల మధ్య గొడవ కారణంగా షూటింగ్ నిలిపివేశారనే న్యూస్ వైరల్ అయింది. అయితే అందులో నిజం లేదని నిర్మాత నాగవంశీ క్లారిటీ ఇచ్చిన సంగతి తెలిసిందే. అతడు, ఖలేజా తర్వాత మహేష్ – త్రివిక్రమ్ కాంబోలో వస్తున్న హ్యాట్రిక్ సినిమా ఇది. పూజా హెగ్డే, శ్రీలీలా హీరోయిన్స్. థమన్ సంగీతం అందిస్తున్నారు. వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుంది.