త్యాగమా.. ? వ్యూహమా ??

చెన్నై సూపర్ కింగ్స్ వరుసగా రెండు సార్లు షాక్ ఇచ్చింది రాజస్థాన్ రాయల్స్. తాజా ఐపీఎల్ సీజన్ లో రాజస్థాన్ తో జరిగిన రెండు మ్యాచ్ లో చెన్నై ఓడిపోయింది. ఈ నేపథ్యంలో బ్యాటింగ్ ఆర్డర్ లో ధోని ముందుగా రావాలని సీఎస్కే అభిమానులు డిమాండ్ చేస్తున్నారు. అయితే ధోని లోయర్ ఆర్డర్ లో రావడానికి కారణాలను ఆ జట్టు బౌలింగ్‌ కోచ్‌ డ్వేన్‌ బ్రావో వివరించాడు.

ధోని బ్యాటింగ్‌ చేయాల్సిన స్థానం ఇదే. జడేజా, రాయుడు, దూబేలాంటి వారికి మరిన్ని ఎక్కువ అవకాశాలు ఇచ్చేందుకు ధోనీ లోయర్‌ ఆర్డర్‌లో వస్తున్నాడు. కెప్టెన్‌గా ధోనీ బాధ్యత తీసుకుని ఇలా చేస్తున్నాడు. ఫినిషింగ్‌ పాత్రను నిర్వహిస్తున్నందుకు సంతోషంగా ఉన్నాడని బ్రావో చెప్పుకొచ్చారు. ఇక చెన్నై తదుపరి మ్యాచ్‌లో ఈ నెల 30న పంజాబ్‌ కింగ్స్‌తో తలపడబోతోంది.