ప్రియాంక-అలియా-కత్రినా రోడ్ ట్రిప్ ఫిల్మ్.. ఈ ఏడాది షురూ !

ప్రియాంక చోప్రా – అలియా భట్ – కత్రినా కైఫ్ లతో కలిసి ఓ రోడ్ ట్రిప్ ఫిల్మ్ ని ప్లాన్ చేశారు ఫరాన్ అక్తర్. అదే Jee Le Zaraa (జీ లే జరా). రీమా కగ్టి తో కలిసి ఫరాన్ ఈ కథను రెడీ చేశారు. 2021లోనే ఈ సినిమా ప్రకటన వచ్చింది. అయితే ఇప్పటి వరకు సెట్స్ మీదకు వెళ్లలేదు. గత ఏడాది  జులై/ఆగస్టులో సినిమా షురూ చేస్తారనే వార్తలు వినిపించాయి. అయితే ప్రియాంక చోప్రా – అలియా భట్ – కత్రినా కైఫ్ ల డేట్స్ ఒకేసారి దొరకకపోవడం తో ఈ ప్రాజెక్టు ఆలస్యం అవుతూ వస్తోంది.

లేటెస్ట్ న్యూస్ ఏంటంటే ? ఈ ఏడాది చివరలో ఈ సినిమా సెట్స్ మీదకు వెళ్లనుంది. ఈ మేరకు రీమా కగ్జి అప్ డేట్ ఇచ్చారు. ఆ లోపు ప్రియాంక చోప్రా – అలియా భట్ – కత్రినా కైఫ్ లు వారి వారి ప్రాజెక్టులు పూర్తి చేయనున్నారు. ఈ ఏడాది మార్చి లో ఫరాన్ రాజస్థాన్ ఏడారిలకు సంబంధించిన ఓ ఫోటోను షేర్ చేశాడు. ఇప్పటికే ఈ సినిమా లొకేషన్స్ ఖరారు చేశారు. ఇక ఈ సినిమాలో యంగ్ హీరో ఇషాన్ కట్టర్ కీలక పాత్రలో కనిపించబోతున్నారని సమాచారమ్.