కులదీప్’ని కోప్పడిన దోని

టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ప్రశాంతత గురించి తెలిసిందే. తన కూల్ కెప్టెన్సీతో టీమిండియాకు ఎన్నో మరుపురాని విజయాలని అందించారు. అంత ప్రశాంతంగా ఉండే ధోనీ.. ఒకసారి చైనామన్‌ బౌలర్‌ కులదీప్‌యాదవ్‌పై ఆగ్రహాన్ని వ్యక్తం చేశాడట. ఇటీవల ఓ షోకు హాజరైన టీంఇండియా స్పిన్నర్లు కులదీప్‌యాదవ్‌, చాహల్‌.. ధోనీతో వారికున్న అనుభవాన్ని పంచుకున్నారు.

ఈ సందర్భంగా ధోనీ తనపై కోపాన్ని ప్రదర్శించిన విషయాన్ని కులదీప్‌యాదవ్‌ చెప్పాడు. ఇండోర్‌ వేదికగా శ్రీలంకతో టీ20 మ్యాచ్‌. ముందుగా బ్యాటింగ్‌ చేసిన భారత్‌ 260పరుగులు చేసింది. భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన లంక అదే రేంజ్ లో ఆడటం మొదలెట్టింది. ఆ సమయానికి నేను బంతి అందుకున్నాను. క్రీజులో ఉన్న బ్యాట్స్‌మెన్‌ నా బంతులను సులభంగా ఎదుర్కొంటూ బౌండరీలు బాదుతున్నారు.

వెంటనే ధోనీ.. నన్ను ఫీల్డ్‌ మార్చుకొని బౌలింగ్‌ చేయమన్నాడు. దానికి సమాధానంగా.. మరేం ఫర్వాలేదు. అంత బాగానే ఉందన్నాను. దీంతో ఒక్కసారిగా ఆవేశానికి గురైన ధోనీ..300మ్యాచ్‌లాడాను. నేనేమైనా పిచ్చోడినా? అంటూ నాపై ఆగ్రహాం వ్యక్తం చేశాడు. ఆ తర్వాత ధోనీ చెప్పినట్లుగానే బౌలింగ్‌ చేసి వికెట్‌ తీశాను. అప్పుడు ధోనీ నా వద్దకు వచ్చి ఇదే కదా నేను చెప్తుంది అంటూ.. దగ్గరికొచ్చి అన్నాడని చెప్పాడు కులదీప్.