బ‌హిష్క‌ర‌ణ‌పై కోర్టుకెక్కిన స్వామీజీ..!!

స్వామి ప‌రిపూర్ణానంద త‌న‌ను హైద‌రాబాద్ నుంచి పోలీసులు బ‌హిష్క‌రించ‌డాన్ని స‌వాలు చేస్తూ కోర్టుకెక్కారు. ఇందుకు సంబంధించి హైకోర్టులోఓ పిటిష‌న్ దాఖ‌లు చేశారు. తెలంగాణ పోలీస్ శాఖ బహిష్కరించడాన్ని సవాలు చేస్తూ హైకోర్టు లంచ్ మోషన్ ధాఖలు చేశారు. ఈ పిటిష‌న్ పై లంచ్ మోషన్ తర్వాత హైకోర్టు విచారించనుంది. భావ ప్రకటన స్వేచ్ఛను,రాజ్యాంగ హక్కులను తెలంగాణ పోలీస్ శాఖ విస్మరిస్తుందని పిటీషన్ లో పేర్కొన్నారు స్వామీజీ. తన బహిష్కరణ ను వెంటనే తొలగించేలా తెలంగాణ పోలీస్ శాఖ కు ఆదేశాలు ఇవ్వాలని పిటీషన్ లో కోరారు.