తెలంగాణ‌కు గురువు కేసీఆరే…!

కాంగ్రెస్ పార్టీపై టీఆర్ఎస్ ఎంపీ క‌విత విమ‌ర్శ‌లు కురిపించారు. త‌మ‌కు సొల్లు క‌బుర్లు చెప్ప‌డం రాద‌ని, ప‌నిచేసుకుంటూ పోతామ‌ని ఆమె అన్నారు. తెలంగాణ తెచ్చాము కాబ‌ట్టే టీఆర్ఎస్ కు అధికారం ఇచ్చార‌న్నారామె. తెలంగాణ ఇచ్చి కాంగ్రెస్ వెన‌క్కు తీసుకుంద‌ని, సిద్ధాంతం కోసం కేసీఆర్ ప్రాణాల‌ను ఫ‌ణంగా పెట్టార‌ని ఆమె చెప్పారు. తెలంగాణ‌కు గురువు కేసీఆరేన‌ని చెప్పారు. హేళ‌న చేసేవారిని ప‌ట్టించుకోవ‌ద్ద‌ని, జ‌మిలి ఎన్నిక‌ల‌కు సిద్ధ‌మ‌ని స్ప‌ష్టం చేశారు. ఎన్నిక‌లు ఎప్పుడొచ్చినా టీఆర్ఎస్ సై అని అన్నారు.