మరో టికెట్ ప్రకటించిన టీ బీజేపీ

తెలంగాణ బీజేపీ మరో స్థానానికి అభ్యర్థిని ఖరారు చేసింది. మాజీ ఎంపీ జితేందర్ రెడ్డి కొడుకు మిథున్ రెడ్డికి మహబూబ్ నగర్ టికెట్ ను ఖరారు చేసింది. ఇప్పటికే 52 మందితో కూడిన తొలి జాబితాను బీజేపీ విడుదల చేసిన సంగతి తెలిసిందే. బీఆర్ఎస్, కాంగ్రెస్ లతో పోలిస్తే బీసీలు, మహిళలకు పెద్దపీఠ వేస్తూ ఫస్ట్ లిస్ట్ ను కమలం పార్టీ రిలీజ్ చేసింది. 

అయితే త్వరలోనే బీజేపీ నుంచి రెండో జాబితా విడుదల కాబోతుంది అనే వార్తలు వినిపిస్తున్న సమయంలో.. జితేందర్ రెడ్డి కొడుకు మిథున్ రెడ్దికి మహబూబ్ నగర్ టికెట్ ను ఖరారు చేస్తూ.. సింగిల్ పేరును ప్రకటించడం ప్రాధాన్యతను సంతరించుకుంది. కోమటిరెడ్డి దారిలో డీకే అరుణ, మరికొందరు కూడా పార్టీని వీడబోతున్నట్లు జోరుగా ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో కమలం పార్టీ అలర్ట్ అయిందా ? అనే డౌటు అనుమానాలు కలుగుతున్నాయి.