స్వస్థలానికి శరత్ మృతదేహం.. నివాళుల‌ర్పించిన మంత్రి క‌డియం

అమెరికాలోని కన్సాస్‌ నగరంలో దుండగుల కాల్పుల్లో బ‌లైన తెలుగు విద్యార్థి శ‌ర‌త్ మృత‌దేహం స్వ‌స్థ‌లానికి చేరుకుంది. ఒక రెస్టారెంటులో గ‌త శుక్రవారం గుర్తుతెలియని వ్యక్తులు ఐదు రౌండ్లు కాల్పులు జరపడంతో కొప్పు శ‌ర‌త్ అక్క‌డిక‌క్క‌డే మృతి చెందిన సంగతి తెలిసిందే. ఈ ఉద‌యం శ‌ర‌త్ మృత‌దేహం వ‌రంగ‌ల్ జిల్లా క‌రీమాబాద్ లోని ఇంటికి చేరుకుంది.

రాష్ట్ర ప్ర‌భుత్వం చొర‌వ‌తో అమెరికాలో అధికారుల‌తో మాట్లాడి మృత‌దేహాన్ని ముంబై మీదుగా రాత్రి శంషాబాద్ విమానాశ్ర‌యానికి తీసుకు వ‌చ్చారు. అక్క‌డి నుంచి వ‌రంగ‌ల్ కు త‌ర‌లించారు. శరత్ మృత‌దేహాన్ని చూసి కుటుంబ స‌భ్యులు, బంధువులు క‌న్నీరు మున్నీర‌య్యారు. శ‌ర‌త్ భౌతిక‌ కాయానికి వరంగల్’ లో నివాసంలో నివాళులు అర్పించారు. ఉప ముఖ్యమంత్రి, విద్యాశాఖ మంత్రి కడియం శ్రీహరి. కుటుంబ సభ్యులను ఓదార్చి వారికి ప్రభుత్వం పూర్తి అండగా ఉంటుందని హామీ ఇచ్చారు.