‘సైరా’కు ప్రకృతి సహకరించడం లేదట

మెగాస్టార్ చిరంజీవి ‘సైరా’ నర్శింహారెడ్డి సినిమా షూటింగ్ కు ప్రకృతి సహకరించడం లేదట. దీంతో చిత్రబృందం తీవ్ర నిరాశలో ఉందట. ప్రస్తుతం ‘సైరా’ షూటింగ్ హైదరాబాద్ కోకపేటలో ప్రత్యేకంగా వేసిన సెట్ లో జరుగుతోంది. అక్కడ నర్సింహారెడ్డి బ్రిటీష్ వారి కోటపై దండెత్తే సన్నివేశాలని రాత్రి వేళలో చిత్రీకరిస్తున్నారు. ఐతే, ఈ షూటింగ్ కు వరుణుడు అండంకిగా మారాడు. కొన్ని రోజులుగా హైదరాబాద్ లో జోరుగా వర్షాలు కురుస్తున్న సంగతి తెలిసిందే.

దీని కారణంగా సైరా షూటింగ్ కి అంతరాయం కలుగుతుందట. షూటింగ్ కోసం అన్ని సిద్ధం చేసుకున్న తరువాత వర్షం ఆటంకం కలిగిస్తుందట. దీంతో వందలాది ఆర్టిస్టులు వెనుదిరిగి వెళ్ళిపోతున్నట్లు తెలిసింది. ఈ కారణంగా సైరా షూటింగ్ ఆలస్యం కావడంతో పాటు.. బడ్జెట్ పెరిగిపోతున్నట్టు చెప్పుకొంటున్నారు. ఇప్పటికే సైరా షూటింగ్ ఆలస్యమైందని చెబుతున్నారు. ఇప్పుడు ప్రకృతి సహకరించకపోవడం అది మరింత ఆలస్యమయ్యేలల కనబడుతోంది.

దాదాపు రూ. 300కోట్లు భారీ బడ్జెట్ తో ‘సైరా’ని తెరకెక్కిస్తోన్న సంగతి తెలిసిందే. ‘బాహుబలి’ రేంజ్ లో ‘సైరా’ని విడుదల చేయబోతున్నారు. మెగాస్టార్ సరసన నయనతార జతకట్టనుంది. బిగ్ బీ అమితాబ్, విజయ్ సేతుపతి, జగపతి బాబు, కిచ్చ సుదీప్.. తదితరులు కీలక పాత్రలో కనిపించబోతున్నారు. ఈ చిత్రానికి సురేందర్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్నారు. రామ్ చరణ్ నిర్మాత.