హైద‌రాబాద్ లో పేలుళ్లు..!!

హైద‌రాబాద్ న‌గ‌రంలోని పుప్పాల‌గూడలో ఒక్క‌సారిగా జ‌రిగిన పేలుళ్లు స్థానికంగా న‌గ‌ర‌వాసుల‌ను ఉలిక్కిప‌డేలా చేశాయి.
టిప్పర్ లో డిటోనేటర్లు పేలడంతో టిప్ప‌ర్ పూర్తిగా ధ్వంసమైంది. పుప్పాల గూడ లోని పేలుళ్లు జరిగిన ప్రాంతం లో పోలీసులు తనిఖీలు నిర్వ‌హిస్తున్నారు. పేలుళ్లు సంభవించిన ప్రాంతానికి ఎవరిని అనుమ‌తించ‌డంలేదు.బాంబ్ అండ్ డాగ్ స్క్వాడ్ తో క్షుణ్ణంగా తనిఖీలు నిర్వ‌హిస్తున్నారు. ఘటన స్థలం లో ఐదు డిటోనేటర్లు స్వాదీనం చేసుకున్నారు పోలీసులు. బండ‌రాళ్ల‌కింద అమ‌ర్చిన జిలెటిన్ స్టిక్స్ ను తొల‌గిస్తున్నారు.

ఒక్క‌సారిగా పేలుళ్లు సంభ‌వించ‌డంతో ప‌క్క‌నే ఉన్న బిల్డింగ్ కి పగుళ్లు వ‌చ్చాయి. దాదాపు ఐదు కిలో మీటర్ల దూరం పేలుళ్లు శబ్దం వినిపించింద‌ని స్థానికులు చెబుతున్నారు. పేలుళ్లు సంభ‌వించిన స‌మ‌యంలో భ‌యాందోళ‌న‌తో ప‌రుగులు తీసామ‌ని చెబుతున్నారు. ఈ పేలుళ్లు లో నలుగు కి గాయాలుకాగా అందులో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్న‌ట్లు తెలుస్తోంది.