పార్టీ కార్యాల‌యంలోనే ఎమ్మెల్యే జేబుకొట్టిన‌ దొంగ‌లు..!!

సినిమాథియేట‌ర్ లోనో, బ‌స్సులోనో, మ‌రింకెక్క‌డైనా దొంగ‌లుండ‌టం, జేబులు కొట్టేయ‌డం విన్నాం, చూసాం. ఇప్పుడు దొంగ‌లు ట్రెండ్ మార్చారో ఏమో తెలియ‌దు కానీ, పార్టీ కార్యాల‌యాల‌ను ఎంచుకున్న‌ట్లున్నారు. అందులోనూ ప్ర‌జా ప్ర‌తినిధుల‌పైనే దృష్టి పెట్టిన‌ట్లుగా ఉంద‌ట గుంటూరు జిల్లాలో జ‌రిగిన సంఘ‌ట‌న.

గుంటూరు జిల్లా కేంద్రంలోని టీడీపీ కార్యాల‌యంలో జేబు దొంగ‌లు హ‌ల్చ‌ల్ చేశారు. జిల్లా అధ్య‌క్షుడు జి.వి.ఆంజ‌నేయులు జ‌న్మ‌దిన వేడుక‌ల సంద‌ర్భంగా అక్క‌డ కార్య‌క‌ర్త‌లు రేప‌ల్లె ఎమ్మెల్యే అన‌గాని స‌త్య‌ప్ర‌సాద్ హాజ‌ర‌య్యారు. సెక్యూరిటీగా అర్బ‌న్ పోలీసులు, గ‌న్ మెన్ లు ఉండ‌గానే ఎమ్మెల్యే జేబులో నుంచి 1ల‌క్షా 20వేల రూపాయ‌లు చోరీ చేశారు. దీంతో అవాక్క‌వ‌డం ఎమ్మెల్యే వంతైంది. అంత సెక్యూరిటీ ఉన్న ఎమ్మెల్యేకే ఇలా జ‌రిగితే ఇక సామాన్యుల ప‌రిస్థితి ఏమిట‌ని గుస‌గుస‌లాడుకుంటున్నారు జ‌నం.