శ్రీరెడ్డికి చెన్నైలో షాక్.. !

నటి శ్రీరెడ్డి చిక్కుల్లో పడింది. ఆమెపై కేసు పెట్టేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇప్పటికే కాస్టింగ్ కౌచ్ తో టాలీవుడ్ ను షేక్ చేసింది.. శ్రీరెడ్డి. ఇప్పుడు తమిళ ఇండస్ట్రీపై తన ఫోకస్ మళ్లించిన సంగతి తెలిసిందే. రాఘవ లారెన్స్, శ్రీనాథ్ తనకు అవకాశాలు ఇప్పిస్తామని మోసం చేశారని సంచలన ఆరోపణలు చేసింది. ఈ క్రమంలోనే ప్రముఖ నటి కుష్బూ భర్త సుందర్ సిపై శ్రీరెడ్డి దారుణమైన కామెంట్స్ చేసింది.

‘హైదరాబాద్ లో అరన్ మనయ్ షూటింగ్ సందర్భంగా ఎగ్జిక్యూటివ్ నిర్మాత గణేష్ తో కలిసి వెళ్లి సుందర్ సి ని కలిశాను. ఆ సందర్భంగానే తన తదుపరి చిత్రంలో నాకు అవకాశం ఇస్తానని చెప్పారు. ఆ తర్వాత నోవాటెల్ కు రమ్మన్నాడు. శారీరక సుఖాన్ని ఇవ్వాలని అడిగాడు. ఆ తర్వాత ఏదో జరిగిపోయింది’ అని శ్రీరెడ్డి తన ఫేస్ బుక్ పోస్టులో పేర్కొంది.

తాజాగా శ్రీరెడ్డి ఆరోపణలపై సుందర్ సి స్పందించారు. ఆ వ్యాఖ్యల్లో నిజం లేదని స్పష్టం చేశారు. ఆమె చెప్పేదంతా అబద్ధమని కొట్టిపారేశారు. అవాస్తవాలు చెబుతున్న శ్రీరెడ్డిపై కేసు పెడతానని హెచ్చరించారు. ఈ మేరకు న్యాయ నిపుణులతో చర్చిస్తున్నట్టు సుందర్ సి. తెలిపారు.

టాలీవుడ్ లో శ్రీరెడ్డిపై ఈ రకమైన హెచ్చరికలు చేసేందుకు ఎవ్వరు సాహాసం చేయలేదు. కనీసం ఖండించనూ లేదు. కోలీవుడ్ లో మాత్రం శ్రీరెడ్డికి గట్టి హెచ్చరికలు చేస్తున్నారు. ఆమె ఎవరిపైనా ఆరోపణలు చేసినా వారు వెంటనే స్పందించాలని నిర్ణయించుకొన్నారు. ఇందులో భాగంగానే సుందర్ సి శ్రీరెడ్డిని కోర్టుకు లాగేందుకు రెడీ అయ్యారు. ఇన్నాళ్లు శ్రీరెడ్డి వైపు నుంచి ఎటాక్ ని మాత్రమే చూశాం. ఇప్పుడు కౌంటర్స్ ని కూడా చూస్తున్నాం.