మహేష్ నిర్మాతకు క్లీన్ చీట్

సూపర్ స్టార్ మహేష్ బాబు నిర్మాతకు క్లీన్ చీట్ ఇచ్చారు. కొరటాల-మహేష్ బాబు కలయికలో రెండో సినిమాగా ‘భరత్ అను నేను’ ప్రేక్షకుల ముందుకొచ్చి బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచిన సంగతి తెలిసిందే. సినిమాలో మహేష్ ముఖ్యమంత్రి పాత్రలో ఇరగదీశాడు. ఆయనకు జోడీగా బాలీవుడ్ హీరోయిన్ కైరా అద్వానీ జతకట్టింది. ఐతే, ఈ సినిమాపై కొద్ది రోజులుగా ఓ దుష్ప్రచారం జరుగుతోంది. నిర్మాత డివివి దానయ్య ఈ సినిమాకు సంబంధించి దర్శకుడు కొరటాల, హీరోయిన్ కైరా అద్వానీలకు ఇంకా పూర్తి స్థాయి రెమ్యూనరేషన్ ఇవ్వలేదన్నది ఆ ప్రచారం సారాంశం.

తాజాగా, ఈ ప్రచారంపై కొరటాల స్పందించారు. ఆ వార్తలు పూర్తిగా అవాస్తవమని చెప్పారు. ఆ సినిమా విడుదలకు ముందే తనకు రావాల్సిన పారితోషికం మొత్తం వచ్చిందని స్పష్టం చేశారు. టాలీవుడ్ లో రామానాయుడు గారి తర్వాత మంచి నిర్మాతగా పేరుగాంచిన వారిలో దానయ్య ఒకరని కొరటాల కితాబిచ్చారు. తమకు రెమ్యున్ రేషన్ ఇవ్వకుండానే…. ఆయన మరో మూడు పెద్ద ప్రాజెక్టులు ఎలా డీల్ చేస్తున్నారని ప్రశ్నించారు.

హీరోయిన్ కైరా అద్వానీ ఈ పుకార్లను కూడా ఖండిస్తూ… ఓ ప్రెస్ నోట్ రిలీజ్ చేసింది. ‘డీవీవీ ఎంటర్ టైన్ మెంట్`లో నటించడం చాలా సంతోషాన్నిచ్చింది. ఇదే బ్యానర్ లో వరుసగా రెండో సినిమా కూడా చేస్తున్నాను. అంతకుముందు సినిమాకు పారితోషికం ఇవ్వకుంటే….తర్వాతి సినిమాలో ఎలా పని చేస్తానని కూడా కైరా ప్రశ్నించింది. అంతకుముందే ఈ ప్రచారాన్ని నిర్మాత దానయ్య ఖండించారు. తమ ప్రొడక్షన్ హౌజ్ మీద వచ్చిన పుకార్లు చాలా బాధించాయని దానయ్య అన్నారు. `భరత్ అనే నేను` చిత్రానికి సంబంధించి ఎవరికీ ఎలాంటి పేమెంట్లు ఎగ్గొట్టలేదన్నారు.

దర్శకుడు కొరటాల, హీరోయిన్ కీర్తి సురేష్ లు దానయ్యపై వచ్చిన పుకార్లని ఖండించడంతో… ఈ వ్యవహారంలో నిర్మాతకు క్లీన్ చీట్ వచ్చినట్టయ్యింది. మరీ.. ఇప్పటికైనా.. భరత్.. సినిమాకు సంబంధించి పుకార్లకు పులిస్టాప్ పడుతుందేమో చూడాల్.