తారక్, చరణ్’ల హీరోయిన్స్ వీరే.. !

ఎన్టీఆర్, రామ్ చరణ్’లతో దర్శకధీరుడు రాజమౌళి ఓ మల్టీస్టారర్ ని ప్లాన్ చేసిన సంగతి తెలిసిందే. అక్టోబర్ నుంచి సెట్స్ మీదకు తీసుకెళ్లనున్నారు. ‘బాహుబలి’ తర్వాత రాజమౌళి చేస్తున్న చిత్రం కావడంతో ప్రేక్షకుల్లో భారీ అంచనాలున్నాయి. దానికి తగ్గట్టుగానే రాజమౌళి మల్టీస్టారర్ ని ప్లాన్ చేస్తున్నారు. దాదాపు రూ. 300కోట్ల బడ్జెట్ తో తెరకెక్కించనున్నారు. తెలుగు, తమిళ్, హిందీ బాషల్లో రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు.

సినిమాలో తారక్, చరణ్ ల పాత్రలు చెరి సమానంగా ఉండేటట్టుగా రాజమౌళి కసరత్తు చేసినట్టు తెలిసింది. ఈ మల్టీస్టారర్ నటించే హీరోయిన్స్ ఎవరు ? అన్నది ఆసక్తిగా మారింది.’మహానటి’ చూసిన దగ్గర నుంచి కీర్తి సురేశ్ ను తన సినిమాలోకి తీసుకోవాలనే ఆలోచనలో రాజమౌళి ఉన్నాడనే వార్తలొస్తున్నాయి. మరో హీరోయిన్ గా పూజా హెగ్డేను తీసుకొనే ఛాన్సుంది అంటున్నారు. ఇదే నిజమైతే.. చరణ్ కి జోడీగా పూజా హెగ్డే, ఎన్టీఆర్ జోడీగా కీర్తి సురేష్ కనిపించే అవకాశాలున్నాయి.

ఇదీగాక, రాజమౌళి చరణ్, తారక్ ల కోసం బాలీవుడ్ హీరోయిన్స్ తీసుకొచ్చే ఛాన్స్ ఉందని చెప్పుకొంటున్నారు. ఈ మల్టీస్టారర్ ని కూడా బాలీవుడ్ లో రిలీజ్ చేసే బాధ్యతని రాజమౌళి ప్రముఖ దర్శక-నిర్మాత కరణ్ జోహార్ చేతిలో పెట్టినట్టు తెలుస్తోంది. బాహుబలి కి బాలీవుడ్ అంతటి క్రేజ్ రావడానికి కరణ్ నే అన్న సంగతి తెలిసిందే. మొత్తానికి.. తారక్, చరణ్ ల రాజమౌళి బాహుబలి రేంజ్ లో తీసుకురానున్నారు.