చంద్ర‌బాబు వ‌ద్ద‌కు జేసీ పంచాయితీ..!!

టీడీపీ ఎంపీ జేసీ దివాక‌ర్ రెడ్డికి, అనంత‌పురం టీడీపీ నేత‌ల‌కు మ‌ధ్య మొద‌లైన పంచాయితీ సీఎం చంద్ర‌బాబు వ‌ద్ద‌కు చేరింది. గ‌త కొంత కాలంగా ప్ర‌భాక‌ర్ రెడ్డికి, దివాక‌ర్ రెడ్డికి మ‌ధ్య పంచాయితీ ముద‌రిన సంగ‌తి తెలిసిందే. పార్టీలో త‌న‌కు సరైన ప్రాధాన్య‌త ల‌భించ‌డం లేదంటూ జేసీ దివాక‌ర్ రెడ్డి అల‌కబూనారు. దీంతో సీఎం చంద్ర‌బాబు క‌లుగ‌జేసుకుని వీరిద్ద‌రి మ‌ధ్య పంచాయితీ స‌ద్దుమ‌ణిగేలా చేశారు. అనంత‌పురం జిల్లా అభివృద్ధికి ఇరువురూ క‌లిసి ప‌నిచేయాల‌ని చంద్ర‌బాబు సూచించారు.

ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి తో మనస్పర్థలు ఉంటే సర్ధుకుపొమ్మ‌ని సీఎం చంద్ర‌బాబు చెప్పార‌ని ప్ర‌భాక‌ర్ చౌద‌రి తెలిపారు. జేసీతో త‌న‌కు వ్యక్తిగత సమస్యలేమీ లేవ‌ని ఆయ‌న చెప్పారు. ఒక్కొక్క‌రి ఆలోచన ఒక్కోలా ఉంటుంద‌ని, అనంత‌పురం అభివృద్ధికి అంద‌రికి స‌హ‌క‌రించ‌డానికి సిద్ధంగా ఉన్నాన‌ని ఆయ‌న అన్నారు. జిల్లాలో పార్టీ బ‌లోపేతానికి జేసీతో క‌లిసి ప‌నిచేయ‌మ‌ని సీఎం చెప్పార‌న్నారు. జేసీకి త‌న‌తో ఏ స‌మ‌స్య ఉందో ఆయ‌న‌కే తెలియాల‌ని ఆయ‌న అన్నారు.