యెమెన్‌లో ఘోర పడవ ప్రమాదం.. 160 మంది గల్లంతు

యెమెన్‌లో ఘోర పడవ ప్రమాదం జరిగింది. సోమాలియాలోని బొసాపో పోర్టు నుంచి బయలు దేరిన పడవ సముద్ర మధ్యంలో మునిగిపోయింది. ఈ పడవ ప్రమాదంలో దాదాపు 160 మంది గల్లంతయ్యారు. ఇందులో 100 మంది సోమాలియా, 60 మంది ఇథియోపియా వాసులు ఉన్నారు. ఈ మేరకు యెమెన్ రక్షణ శాఖ ఓ ప్రకటన చేసింది. వీరు ఆఫ్రికా నుంచి వలస వస్తున్నట్టు తెలిసింది. కొంతకాలంగా యెమెన్‌లో అంతర్గత సంక్షోభం నెలకొన్న నేపథ్యంలో ఆఫ్రికా దేశాల నుంచి వలసలు పెరిగిన సంగతి తెలిసిందే. పరిమితికి మించి ప్రయాణించడం వల్లనే ప్రమాదం జరిగి ఉంటుందని అనుమానిస్తున్నారు. ఈ ప్రమాదంలో ఎంత మంది ప్రాణాలతో బయట పడ్డారు. ఎంత మంది ప్రాణాలు కోల్పాయారు అన్నది తెలియాల్సి ఉంది.