కాంగ్రెస్ లో చేరిన బైరెడ్డి..!

గ‌తంలో టీడీపీ నుంచి బ‌య‌ట‌కు వ‌చ్చి ప్ర‌త్యేక రాయ‌ల‌సీమ ఉద్య‌మాన్ని అందుకున్న బైరెడ్డి రాజ‌శేఖ‌ర్ రెడ్డి ఢిల్లీలో రాహుల్ స‌మ‌క్షంలో కాంగ్రెస్ లో చేరారు. కొంత‌కాలం ఆయ‌న మ‌ళ్లీ టీడీపీలో చేర‌తారంటూ ప్ర‌చారం జ‌రిగినా ప్ర‌స్తుత రాజ‌కీయ ప‌రిణామాల నేప‌థ్యంలో భ‌విష్య‌త్ రాజ‌కీయాల‌ను దృష్టిలో ఉంచుకుని ఆయ‌న కాంగ్రెస్ లో చేరారు. ఏపీలో కిర‌ణ్ చేరిక త‌రువాత చాలామంది కాంగ్రెస్ లో చేర‌తారంటూ ఆయ‌న వ్యాఖ్యానించిన సంగ‌తి తెలిసిందే. ఏపీలో కాంగ్రెస్ బ‌లోపేతానికి ఆ పార్టీ చేరిక‌ల‌ను ప్రోత్స‌హిస్తోంది. వ‌చ్చే ఎన్నిక‌ల్లో రాష్ట్రంలో కాంగ్రెస్ బ‌ల‌ప‌డేందుకు వ్యూహం సిద్ధం చేసుకుంటోంది. అందులో భాగంగానే కిర‌ణ్ చేరిక త‌రువాత బైరెడ్డికి కూడా హ‌స్తం అందించారు కాంగ్రెస్ నేత‌లు. ఢిల్లీలో ఏపీపీసీసీ ర‌ఘువీరా రెడ్డితో క‌లిసి వెళ్లిన బైరెడ్డికి రాహుల్ కండువా క‌ప్పి పార్టీలోకి ఆహ్వానించారు.