గుడ్ న్యూస్ : ఈ ఆగస్టులోనే ప్రభాస్ సినిమా

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ అభిమానులకు గుడ్ న్యూస్. వచ్చే నెలలోనే అభిమానుల కోరికని తీర్చబోతున్నాడు ప్రభాస్. ప్రస్తుతం ప్రభాస్ సుజీత్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ‘సాహో’ సినిమాతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. దాదాపు రూ. 300కోట్ల భారీ బడ్జెట్ తో తెరకెక్కుతోన్న చిత్రమిది. యాక్షన్ సీన్స్ కోసం ఏకంగా రూ. 90కోట్లు ఖర్చు చేయనున్నారు. బాహుబలి తర్వాత ప్రభాస్ చేస్తున్న సినిమాకావడంతో ‘సాహో’పై ప్రేక్షకుల్లో భారీ అంచనాలున్నాయి. అందుకు తగ్గట్టుగానే భారీతనంతో తెరకెక్కుస్తున్నారు. తెలుగు, తమిళ్, హిందీ, మలయాళ బాషల్లో సినిమాని విడుదల చేయనున్నారు. ఈ సినిమాని వచ్చే యేడాది ప్రేక్షకుల ముందుకు తీసుకు రానున్నారు. రిలీజ్ డేటుపై ఇంకా అధికారిక ప్రకటన రాలేదు.

ఈ సినిమా తర్వాత ‘జిల్’ ఫేం రాథాకృష్ణ దర్శకత్వంలో ప్రభాస్ ఓ సినిమా చేయనున్నారు. ఇదో ప్రేమకథా చిత్రం. 1965 సం॥కు లింకు చేసి ఈ ప్రేమకథని చూపించబోతున్నారు. అది అద్భుతంగా ఉండబోతుందని అని ప్రచారం జరిగింది. సాహో సినిమా తర్వాత ఈ ప్రేమకథని సెట్స్ మీదకు తీసుకెళ్లనున్నారని తెలిసింది. ఐతే, ఇప్పుడీ సినిమా అర్జెంటుగా మొదలెట్టేందుకు రంగం సిద్ధం చేసినట్టు సమాచారమ్. వచ్చే నెల (ఆగస్టు)లోనే సినిమాని సెట్స్ మీదకు తీసుకెళ్లనున్నారని తెలుస్తోంది. ఇందులో ప్రభాస్ సరసన పూజ హెగ్డే జతకట్టనుంది. ఈ సినిమా కూడా యూవీ క్రియేషన్స్ బ్యానర్ పై తెరకెక్కనుంది.

ఇక, సాహో సినిమా జెడ్ స్వీడుతో షూటింగ్ జరుపుకుంటోంది. ఇందులో ప్రభాస్‌ సరసన బాలీవుడ్ బ్యూటీ శ్రద్ధా కపూర్‌ జతకట్టనుంది. హాలీవుడ్, బాలీవుడ్ కు చెందిన నటులు, టెక్నీషన్స్ సాహో కోసం పని చేస్తున్నారు. ప్రభాస్ సొంత బ్యానర్’గా పిలవబడే యూవీ క్రియేషన్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది.