యాదాద్రిలో తొలి ఏకాద‌శి పూజ‌లు

తొలి ఏకాద‌శి ప‌ర్వ‌దినాన్ని పుర‌స్క‌రించుకుని వైష్ణ‌వ, శైవ దేవాల‌యాల‌న్నీ భ‌క్తుల‌తో కిట‌కిట‌లాడుతున్నాయి. ఈ రోజున శివుడికి అభిషేకం చేస్తే మంచి జ‌రుగుతుంద‌ని, శ్రీ‌వారిని ద‌ర్శించుకుని ఉప‌వాసం చేస్తే స‌క‌ల శుభాలు క‌లుగుతాయ‌ని భ‌క్తుల న‌మ్మ‌కం. తెలంగాణ‌లో అత్య‌ద్బుత పుణ్య‌క్షేత్రంగా అభివృద్ధి చెందుతున్న యాదాద్రి ఆల‌యానికి భ‌క్తులు పోటెత్తారు. తొలి ఏకాద‌శి సంద‌ర్భంగా యాదాద్రి క్షేత్రంలో స్వామివారికి వైభ‌వంగా ల‌క్ష‌పుష్పార్చ‌న నిర్వ‌హించారు. ప్ర‌త్యేక పూజ‌ల్లో పాల్గొని భ‌క్తులు త‌రించారు.