అశ్విన్‌కు గాయం !

టీమ్‌ఇండియా స్పిన్నర్‌ అశ్విన్‌కు గాయమైంది. గురువారం ఉదయం నెట్స్‌లో ప్రాక్టీస్‌ చేస్తున్న సమయంలో అశ్విన్‌ కుడిచేతికి గాయమైంది. ముందుజాగ్రత్తగా అశ్విన్‌ ఎసెక్స్‌తో ప్రాక్టీస్‌ మ్యాచ్‌లో రెండో రోజు మైదానంలోకి దిగలేదు. ఐతే, అది స్వల్ప గాయమేనని టీమ్‌ ఫిజియో తేల్చాడు. దీంతో తొలి టెస్టుకు అశ్విన్ అందుబాటులో ఉండనున్నారు.

ఇక, టీమ్‌ఇండియా సన్నాహక మ్యాచ్‌లో మెరుగైన ప్రదర్శనే చేస్తోంది. తొలి ఇన్నింగ్స్‌లో టీమ్‌ఇండియా 395 పరుగులకు ఆలౌటైంది. రెండో రోజు ఆటలో హార్దిక్‌ పాండ్యా 51, రిషబ్‌ పంత్‌ 34 (నాటౌట్‌) రాణించారు. తొలి ఇన్నింగ్స్‌ లో ఎసెక్స్‌ 335/5 తో ఆటని కొనసాగిస్తొంది. కెప్టెన్‌ వెస్లీ (57; 89 బంతుల్లో 11×4), పెప్పర్‌ (68; 74 బంతుల్లో 15×4) అర్ధశతకాలతో సత్తాచాటారు. ఆ తర్వాత పుంజుకున్న బౌలర్లు ఉమేష్ యాదవ్, ఇషాంత్ లు భారత్‌ను తిరిగి పోటీలోకి వచ్చారు. ఉమేశ్‌, ఇషాంత్‌లకు తలో రెండు వికెట్లు పడగొట్టారు.