ఆసుపత్రిలో చేరిన మణిరత్నం.. అసలేమైంది.. ?

దర్శకుడు మణిరత్నం ఆసుపత్రిలో చేరారు. దీంతో ఆయన హెల్త్ పై రూమర్స్ మొదలయ్యాయి. మణిరత్నంకు గుండెపోటు వచ్చిందని, ఆయనను చెన్నైలోని అపోలో ఆసుపత్రికి తరలించి వైద్యసేలందిస్తున్నారని మీడియాలో వార్తలొచ్చాయి. ఐతే, ఈ వార్తలని మణిరత్నం సన్నిహితులు కొట్టిపారేశారు. కేవలం సాధారణ వైద్య పరీక్షల్లో భాగంగానే ఆయన ఆసుపత్రికి వెళ్లారని చెప్పారు. మణిరత్నం ఆరోగ్యంగానే ఉన్నారు. ఆందోళన చెందాల్సిన అవసరం లేదని తెలిపారు. దీంతో.. మణిరత్నం అభిమానులు ఊపిరిపీల్చుకొన్నారు.

ప్రస్తుతం ‘చెక్క చీవంత వాణం’ తమిళ సినిమాను మణిరత్నం రూపొందిస్తున్నారు. ఈ చిత్రం తెలుగులో ‘నవాబ్’గా విడుదల కానుంది. జ్యోతిక, ఐశ్వర్యా రాజేష్ కూడా హీరోయిన్లుగా నటిస్తున్నారు. ‘చెలియా’ హీరోయిన్ అదితీరావ్ హైదరి కీలక పాత్రలో కనిపించనుంది. ఈ చిత్రానికి సంగీతం ఎఆర్ రెహ్మాన్. మద్రాస్‌ టాకీస్‌, లైకా ప్రొడక్షన్స్‌ హౌజ్‌ వారు సంయుక్తంగా ఈ భారీ మల్టీస్టారర్‌ను తెరకెక్కిస్తున్నారు.