రణ్ వీర్-దీపిక వివాహం.. ఈ యేడాదిలోనే !

బాలీవుడ్ ప్రేమజంట రణ్ వీర్ సింగ్ – దీపికా పదుకొనెలు పెళ్లితో ఒక్కటవ్వబోతున్నారు. అది కూడా ఈ యేడాదిలోనేనని తెలిసింది. వారి సన్నిహిత వర్గాలు ఈ విషయాన్ని దృవీకరించినట్టు చెబుతున్నారు. వీరి పెళ్లిని యూరప్ లో ప్లాన్ చేస్తున్నారంట. ఇటలీలోని లేక్ కోమో ప్రాంతాన్ని ఎంచుకొన్నట్టు సమాచారమ్. విడిపోయారని ప్రచారం జరిగిన ప్రతిసారి ఈ జంట షాకిచ్చేది. ఇటీవల కాలంలో పెళ్లి చేసుకోబోతున్నట్టు సంకేతాలు కూడా ఇచ్చారు. ఒక్కటిగా పార్టీలకు హాజరై.. సన్నిహితంగా కనిపించి ప్రేమ తగ్గలేదు. అది పెళ్లి వరకు వెళ్తుందని చెప్పకనే చెప్పారు. ఇప్పుడు నిజంగానే పెళ్లికి రెడీ అయ్యారు.

గతేడాది డిసెంబర్ లో కోహ్లీ-అనుష్క శర్మల వివాహం జరిగింది. ఇక, ఈ యేడాది సోనమ్ కపూర్ తన స్నేహితుడు ఆనంద్ అహుజాను పెళ్లి చేసుకొంది. ఇప్పుడు దీపిక-రణ్ వీర్ సింగ్ ల వంతు వచ్చింది. బాలీవుడ్ లో కొన్నాళ్ల పాటు మాట్లాడుకొనే విధంగా వీరి పెళ్లి జరగనున్నట్టు సమాచారమ్. ఈ యేడాది చివరలోగా చేతిలో ఉన్న సినిమాలనీ పూర్తి చేసే పనిలో వీరు ఉన్నట్టు తెలుస్తోంది. పెళ్లి తర్వాత కొన్నాళ్లపాటు షూటింగ్ లకు దూరంగా ఉండేలా ప్లాన్ చేసుకొంటున్నారంట. .