‘చి ల సౌ’ ట్రైలర్ టాక్

నటుడు రాహుల్ రవీంద్రన్ దర్శకుడుగా మారి తీసిన చిత్రం ‘చి ల సౌ’. సుశాంత్ – రుహాని శర్మ జంటగా నటించారు. ఈ సినిమా ఆగస్టు 3న ప్రేక్షకుల ముందుకు రానుంది. తాజాగా, ఈ సినిమా ట్రైలర్ ని కింగ్ నాగార్జున చేతుల మీదుగా విడుదల చేశారు.

‘ఎక్కువగా హీరో-హీరోయిన్ ల మధ్య సీన్స్ తో ట్రైలర్ ని కట్ చేశారు. హీరోని పెళ్లి చేసుకోమని ఒత్తిడి చేసే సీన్స్. అమ్మాయితో పరిచయం, ప్రేమ, చిన్న గొడవ, ఎమోషనల్ సీన్స్, ప్రేమతో నుదిటిపై ఓ ముద్దు.. లాంటి బిట్స్ తో ట్రైలర్ ఆకట్టుకుంటోంది. ట్రైలర్ చాలా ఫ్రెష్ గా ఉంది. సుశాంత్, రుహాని సెటిల్డ్ గా నటించినట్టు కనిపించింది. ప్రేమికుల మధ్య వచ్చే ఎమోషనల్ సీన్స్, మాటలు యువతని ఆకట్టుకొనేలా ఉన్నాయని’ ట్రైలర్ ద్వారా అర్థమవుతోంది. ‘చి ల సౌ’ ట్రైలర్ ని మీరూ చూసేయండీ.. !