బాబోయ్.. లుంగీ కట్టుకొనే ఆడియో ఫంక్షన్ కి !

యంగ్ హీరో విజయ్ దేవరకొండ మరోసారి ట్రెండ్ సెట్టర్ అనిపించుకొన్నాడు. ఆయన తాజా చిత్రం ‘గీత గోవిందం’. ఈ సినిమా ఆడియో ఫంక్షన్ హైదరాబాద్ ఫిల్మ్ నగర్‌లోని జేఆర్సీ కన్వెన్షన్‌లో జరుగుతోంది. ఐతే, ఈ వేడుకకి హీరో విజయ్ దేవరకొండ లుంగీ కట్టుకొని వచ్చి సప్రైజ్ ఇచ్చారు. అది కూడా విజయ్ సొంత బ్రాండ్ ‘రౌడీ’ లుంగీ కావడం విశేషం. ‘అర్జున్ రెడ్డి’గా ట్రెండు సెట్ చేశారు విజయ్. ఈ సినిమాతో క్రేజీ స్టార్ గా మారాడు. యూత్ విజయ్ కు మాములు ఫాలోయింగ్ లేదు. ఏకంగా జూ. పవర్ స్టార్ అనిపించుకొంటున్నారు.

ఇక, టాలీవుడ్ స్టార్స్ లుంకీ లుక్ లో కనిపించడం చాలా అరుదు. సూపర్ స్టార్ మహేష్ బాబు తెరపై ఒకట్రెండు సార్లు లుంగీ లుక్ లో కనిపించి అభిమానులని మురిపించారు. ‘శ్రీమంతుడు’, ‘భరత్ అను నేను’ సినిమాలో ఒకట్రెండు సీన్స్ మాత్రమే లుంగీ కట్టుకొని కనిపించారు. స్టయిలీష్ స్టార్ బన్నీ కూడా ‘డీజే’ లుంగీ కట్టుకొని కనిపించారు. ఇప్పుడు విజయ్ దేవరకొండ ఎవ్వరు చేయని డేర్ చేశారు. ఏకంగా ఆడియో ఫంక్షన్ కే లుంగీ కట్టుకొని వచ్చారు.

పరశురామ్ దర్శకత్వంలో ‘గీతా గోవిందం’ తెరకెక్కింది. విజయ్ కి జంటగా రష్మిక మందన జతకట్టనుంది. గోపిసుంద‌ర్ సంగీతం. గీతాఆర్ట్స్ 2 బ్యానర్ నిర్మించింది. ఈ రొమాంటిక్ ఎంటర్ టైనర్ ని ఆగస్టు 15న ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు.