గీత గోవిందం.. బన్నీ మెచ్చిన కథ !

స్టయిలీష్ స్టార్ అల్లు అర్జున్ మెచ్చిన కథతో విజయ్ దేవరకొండ సినిమా తెరకెక్కింది. ‘గీత గోవిందం’ కథని 2యేళ్ల క్రితమే బన్నీకి వినిపించాడట దర్శకుడు పరశురామ్. ఆదివారం జరిగిన ఈ చిత్ర ఆడియో వేడుకలో బన్నీ ఈ విషయాన్ని చెప్పారు. కథ చాలా బాగుంటుంది. హీరోయిన్ పాత్రకు చాలా ప్రాధాన్యత ఉన్న కథ ఇది అన్నారు. ‘పరుగు’ సినిమాకు పరశురామ్ అసిస్టెంట్ డైరెక్టర్ గా చేశారు. అప్పటి నుంచి అతడు నాకు తెలుసు. ఐతే, ‘శ్రీరస్తు శుభమస్తు’ సినిమా నుంచి ఆయన్ని చాలా దగ్గరగా చూస్తున్నానని చెప్పారు.

‘అర్జున్ రెడ్డి’ లాంటి పాత్ర చేసిన విజయ్ దేవరకొండ.. ఈ రొమాంటిక్ ఎంటర్ టైనర్ లో ఎలా నటించారనే ఆసక్తి ప్రేక్షకుల్లో నెలకొంది. ‘అర్జున్ రెడ్డి’ని చూసిన తర్వాత విజయ్ దేవరకొండతో ఇలాంటి సినిమాని చేసేందుకు అల్లు అరవింద్ కూడా జక్కారట. ఐతే, ముందుగా అనుకొన్న కథలో ఎలాంటి మార్పులు లేకుండా సినిమా చేశాం. విజయ్ అద్భుతంగా నటించారన్నారు అరవింద్. ఈ చిత్రానికి సంగీతం గోపీ సుందర్. గీతా ఆర్ట్స్ 2 బ్యానర్ పై తెరకెక్కింది. ఆగస్టు 15న ‘గీత గోవిందం’ ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు.