కరుణానిధిని పరామర్శించిన రజనీ


సూపర్ స్టార్ రజనీకాంత్ డెహ్రాడూన్‌ పర్యటనని ముగించుకొని చెన్నై చేరుకొన్నారు. వచ్చి రాగానే.. అనారోగ్యంతో కావేరీ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న డీఎంకే కురువృద్ధుడు కరుణానిధిని రజనీకాంత్‌ పరామర్శించారు. ఆయన ఆరోగ్య పరిస్థితి గురించి కుటుంబ సభ్యులని అడిగి తెలుసుకొన్నారు. అనంతరం రజనీ మీడియాతో మాట్లాడుతూ.. “కరుణానిధి దేశంలోనే సీనియర్‌ నాయకుడు. ఆయన సంపూర్ణ ఆరోగ్యం పొందాలని దేవుడిని ప్రార్థిస్తున్నా’నన్నారు.

గత యేడాది రజనీ పొలిటికల్ ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఐతే, ఇప్పటి వరకు ఆయన పార్టీ జెండా, అజెండా ప్రకటించలేదు. ప్రస్తుతం రజనీ సినిమాలతో బిజీగా ఉన్నారు.
కార్తీక్ సుబ్బ రాజు దర్శకత్వంలో రజనీ సినిమా తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో రజనీకి విలన్ గా విజయ్ సేతుపతి నటిస్తున్నారు. ఇక, శంకర్ దర్శకత్వంలో తెరకెక్కిన రజనీ రోబో ‘2.ఓ’ నవంబర్ 29న ప్రేక్షకుల ముందుకు రానుంది.