శర్వానంద్’తో గొడవపై సాయి పల్లవి క్లారిటీ


టాలీవుడ్ లో హవా చూపిస్తున్న యంగ్ హీరోయిన్స్ లో సాయిపల్లవి ఒకరు. తన అందం, అభినయంతో తెలుగు ప్రేక్షకులని ‘ఫిదా’ చేసేసింది.. ఈ ముద్దుగుమ్మ. ‘ఫిదా’తో వచ్చిన క్రేజ్ తో బిజీ హీరోయిన్ అయిపోయింది. ఆఫర్ల మీద ఆఫర్లు వచ్చి పడ్డాయి. ఐతే, వాటిలో ఏది పడితే అది ఒప్పుకోవడం లేదు పల్లవి. కథాబలం ఉన్న వాటికే ఓకే చెబుతోంది. ఇంతవరకు బాగానే ఉంది. కానీ, ఈ బ్యూటీ హీరోలతో గొడవలకు దిగుతుందనే ప్రచారం ఆమె ఇమేజ్ ని డ్యామేజ్ చేస్తోంది.

‘కణం’ సినిమా షూటింగ్ సమయంలో నాగశౌర్యతో గొడవ పెట్టుకొందనే ప్రచారం జరిగింది. ఆ తర్వాత నానితోనూ గొడవపడింది. ‘మిడిల్ క్లాస్ అబ్బాయి’ షూటింగ్ లో సాయి పల్లవి ప్రవర్తన నానిని షాక్ గురిచేసిందని చెప్పుకొన్నారు. తాజాగా, శర్వానంద్ తోనూ సాయి పల్లవి గొడవ పడిందనే న్యూస్ హాట్ టాపిక్ గా మారింది. వీరిద్దరు జంటగా ‘పడి పడి లేచే మనసు’ తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. ఈ సినిమా షూటింగ్ సమయంలో శర్వా-పల్లవిల మధ్య గొడవ జరిగింది. ఆ కారణంగానే శర్వా షూటింగ్ కూడా హాజరుకావడం లేదని చెప్పుకొంటున్నారు.

తాజాగా, ఈ ప్రచారంపై సాయి పల్లవి స్పందించింది. ”శర్వానంద్ తో నేను గొడవ పడినట్టుగా .. అందువల్లనే షూటింగ్ ఆగిపోయినట్టుగా ప్రచారం జరుగుతోంది. ఇందులో ఎంతమాత్రం నిజం లేదు .. మా మధ్య ఎలాంటి గొడవ జరగలేదు. శర్వానంద్ మరో సినిమా కూడా చేస్తున్నాడు. ఆ సినిమా షూటింగులో పాల్గొంటున్న కారణంగా ఆయన ఈ సినిమాకి బ్రేక్ ఇచ్చాడు.. అంతే” అంటూ క్లారిటీ ఇచ్చింది. మరి.. ఇప్పటికైనా ‘ఫిదా’ పోరిపై వస్తున్న భయంకరమైన ప్రచారానికి బ్రేక్ పడుతుందేమో చూడాలి.