క్రికెట్ ఆడిన మహేష్.. పోర్లు, సిక్స్ లతో విజృంభణ !


సూపర్ స్టార్ మహేష్ బాబు మైదానంలో అడుగుపెట్టాడు. స్నేహితులతో కలిసి సరదా క్రికెట్ ఆడారు. మహేష్ టీంలో అల్లరి నరేష్ కూడా ఉన్నారు. ఇప్పటికే అర్థమైపోయి ఉంటుంది. ఇది మహేష్ 25వ సినిమాకు సంబంధించిన వార్త అని. అది నిజమే. వంశీ పైడిపల్లి దర్శకత్వంలో మహేష్ 25 సినిమా తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. ఇందులో కొన్ని సన్నివేశాలు కళాశాల నేపథ్యంలో సాగుతాయి. మహేష్‌ విద్యార్థిగా కనిపించబోతున్నాడు.
ఈ ఏపీసోడ్ లో మహేష్ మైదానంలోకి దిగి తన స్నేహితులతో కలిసి క్రికెట్‌ ఆడుతూ సందడి చేయబోతున్నాడట. ఆ నేపథ్యంలో వచ్చే సన్నివేశాల్ని, పోరాట సన్నివేశాలని ఇటీవలే తెరకెక్కించారు. గతంలో తెరమీద, తెర వెనక మహేష్ బ్యాట్ పట్టడం ఎప్పుడు చూడలేదు. ఐతే, ఈ సారి మహేష్ మైదానం రెచ్చిపోయి ఫోర్లు, సిక్సులు కొడుతుంతే ఫ్యాన్స్ పండగ చేసుకోనున్నారు.

ఈ చిత్రంలో మహేష్ కొత్త లుక్‌లో కనిపించబోతున్నారు. ఆయన సరసన పూజా హెగ్డే జతకట్టనుంది. ఈ చిత్రానికి సంగీతం దేవిశ్రీ ప్రసాద్. దిల్ రాజు-పివిపి-అశ్వినీదత్ లు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ సినిమాని వచ్చే యేడాది ఏప్రిల్‌ 5న ప్రేక్షకుల ముందుకు రానున్నారు.