శంషాబాద్ లో విమానానికి త‌ప్పిన ప్ర‌మాదం..!

శంషాబాద్ ఎయిర్‌పోర్టులో విమానానికి తృటిలో ప్రమాదం తప్పింది. కువైట్ నుంచి వచ్చిన జెజిరా ఎయిర్‌లైన్స్ ల్యాండ్ అవుతుండగా కుడివైపు ఇంజిన్‌లో ఒక్క‌సారిగా మంటలు చెలరేగాయి. అప్ర‌మ‌త్త‌మైన పైలెట్ రన్‌వేపైనే విమానాన్ని నిలిపివేశాడు. వెంటనే ఫైరింజన్లు విమానం దగ్గరకు చేరుకుని మంటలను ఆర్పివేయడంతో పెద్ద ప్రమాదం తప్పింది. ప్రమాదం జ‌రిగిన‌ సమయంలో విమానంలో దాదాపు 150 మంది ప్రయాణికులు ఉన్నట్లు తెలుస్తోంది. విమానం గాల్లో ఉండగానే మంటలు చెలరేగడాన్ని గుర్తించిన ఎయిర్‌పోర్టు అధికారులు ఎమర్జెన్సీగా క్లియరెన్స్ ఇచ్చి రన్‌వేపై దించడంతో పెద్ద ప్రమాదం తప్పింది. ఎలాంటి ప్రమాదం జరగకపోవడంతో ప్రయాణికులంతా ఊపిరిపీల్చుకున్నారు.