ప‌వ‌న్’తో మోత్కుప‌ల్లి భేటీ.. ఎందుకబ్బా..?

తెలుగుదేశం పార్టీ బ‌హిష్కృత నేత మోత్కుప‌ల్లి న‌ర్సింహులు ఏపీ రాజ‌కీయాల‌పై స్పీడ్ పెంచారు. చంద్ర‌బాబును ఓడించాల‌ని తిరుమ‌ల శ్రీ‌వారిని న‌డ‌క‌దాని ద‌ర్శించుకున్న సంగ‌తి తెలిసిందే. ఇప్ప‌టికే కాపు ఉద్య‌మ‌నేత ముద్ర‌గ‌డ‌తో పాటు వైసీపీ ఎంపీ విజ‌య‌సాయిరెడ్డి కూడా ఆయ‌నతో ప్ర‌త్యేకంగా భేటీ అయి ఆయ‌న సంఘీభావం తెలిపారు. తాజాగా మోత్కుప‌ల్లితో గురువారం మ‌ధ్యాహ్నం ఆయ‌న భేటీ కానున్నారు. ప‌వ‌న్ మ‌గాడు అంటూ కామెంట్స్ చేసిన , ప‌వ‌న్ గెలుపు కోసం కూడా ప్ర‌చారం చేస్తాన‌ని చెప్పిన మోత్కుప‌ల్లి ఇప్పుడు ప‌వ‌న్ తోభేటీ కావ‌డం ప్రాధాన్య‌త సంత‌రించుకుంది.