పీకల్లోతు కష్టాల్లో భారత్ 148/6

ఇంగ్లాండ్‌తో జరుగుతున్న తొలి టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో టీమిండియా పీకల్లోతు కష్టాల్లో పడింది. 148 పరుగులకే ఆరు వికెట్లు కోల్పోయింది. కెప్టెన్ కోహ్లీ (24; 70 బంతుల్లో 4×4) ఒంటరి పోరాటం చేస్తున్నాడు. మురళీ విజయ్‌(20), శిఖర్‌ ధావన్‌(26), హార్ధిక్ పాండ్యా 22 పరుగులు చేశారు. లోకేశ్‌ రాహుల్‌ (4), అజింక్య రహానె (15), దినేశ్‌ కార్తీక్‌ (0) నిరాశపరిచారు. అంతకుముందు ఇంగ్లాండ్‌ తొలి ఇన్నింగ్స్‌లో 287 పరుగులకు ఆలౌటైంది. తొలి రోజు ఆట ముగిసే సమయానికి ఇంగ్లాండ్‌ 9 వికెట్ల నష్టానికి 285 పరుగులు చేసిన సంగతి తెలిసిందే. రెండో రోజు రెండో ఓవర్‌లో నాలుగో బంతికే ఇంగ్లాండ్ తన ఏకైక వికెట్‌ను కోల్పోయింది. ఇంగ్లాండ్‌ బ్యాట్స్‌మెన్లు రూట్‌(80), బెయిర్‌స్టో(70), జెన్నింగ్స్‌ (42) పరుగులతో రాణించారు.