ముసలి పాత్రలో సమంత

పెళ్లి తర్వాత ప్రయోగాలకు రెడీ అయ్యింది సమంత. విభిన్నమైన కథలని వెతికి పట్టుకొంటోంది. ఈ క్రమంలోనే ‘యు-టర్న్’ సినిమాని ఎంచుకొంది. ఇప్పుడా సినిమా షూటింగ్ కూడా పూర్తి చేసింది. తాజాగా, సామ్ ఓ ప్రయోగాత్మక సినిమాలో నటించేందుకు రెడీ అవుతోంది. ఇందులో 70యేళ్ల వృద్దురాలిగా కనిపించబోతుంది. ఈ సినిమాకు నందిని రెడ్డి దర్శకత్వం వహించనున్నారు. ‘మిస్ గ్రాన్ని’ అనే కొరియన్ సినిమా ఆధారంగా రెడీ చేసుకొన్న కథ ఇదని తెలిసింది.

ఈ చిత్ర కథ ప్రకారం 70 ఏళ్ల వృద్దురాలిగా ఉన్న మహిళ, అతీతమైన శక్తులు ఉన్న ఫోటో స్టూడియోకు వెళ్ళగానే నవయవ్వన యువతిగా మారిపోతుంది. ఈ పాయింట్ సామ్ ని ఆకట్టుకొంది. నటనకు మంచి స్కోప్ ఉన్న కథ. ప్రస్తుతం నందిని రెడ్డి కథ సిద్ధం చేసే పనిలో ఉన్నట్టు తెలుస్తోంది. ఇప్పుడు యంగ్ సమంత అందం, ఆమె టాలెంట్ ని చూస్తున్నాం. మనతో పాటు సామ్ కూడా ముసలి సమంతని చూసుకోబోతుంది.. ! వినడానికి కాస్త ఆశ్చర్యంగానే ఉంది. ఇక, ముసలి సమంత చూడ్డానికి ఎలాగుంటుందో.. !!

ఇక, చేతిలో ఉన్న సినిమాలనీ పూర్తి చేసిన సమంత చైతూ కోసం ఎదురు చూస్తోంది. ‘నిన్నుకోరి’ దర్శకుడు శివ నిర్వాణ దర్శకత్వంలో చైతూ-సమంత జంటగా ఓ సినిమా తెరకెక్కనున్న సంగతి. ఇటీవలే ఘనంగా ప్రారంభోత్సవం జరుపుకొంది. పెళ్లి తర్వాత చైతూ-సమంత కలిసి నటిస్తున్న తొలి చిత్రమిది. సినిమాలోనూ పెళ్లైన జంటగా కనిపించనున్నారు.