కోలీవుడ్ రేసులోకి ‘RX 100’ హీరో.. !!


టాలీవుడ్ లో ‘RX 100’ బండి అదిరిపోయే మైలేజ్ ఇచ్చింది. ఆ బండిని డిజైన్ చేసిన దర్శకుడు అజయ్ భూపతి , డ్రైవ్ చేసిన హీరో-హీరోయిన్ కార్తీకేయ-పాయల్ రాజ్ పుత్ లని ఫేమస్ చేసేసింది. ఇప్పుడు వీరికి పెద్ద పెద్ద అవకాశాలు వస్తున్నాయి. దర్శకుడు అజయ్ భూపతి ఓ స్టార్ హీరోతో సినిమా చేసేందుకు ప్లాన్ చేసుకొంటున్నట్టు సమాచారమ్. ఈ సినిమాతో బోల్డ్ నటిగా పేరు తెచ్చుకొన్న పాయల్ కోసం మహేష్ బాబు లాంటి స్టార్స్ కన్నేసినట్టు చెబుతున్నారు. ఇప్పటికే తేజ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న బెల్లకొండ సినిమాలో ఓ హీరోయిన్ గా ఎంపికైంది పాయల్. మరో హీరోయిన్ గా కాజల్ కనిపించనుంది.

తాజాగా, హీరో కార్తీకేయ రెండో సినిమా ఫైనల్ అయ్యింది. ఆయన తన రెండో సినిమా కోసం తమిళ్ దర్శకుడు టీఎస్ కృష్ణతో జతకట్టబోతున్నాడు. ఈ చిత్రాన్ని కలైపులి థాను నిర్మించనున్నారు. ఈ విషయాన్ని కార్తీకేయ తన ట్విట్టర్ ఖాతా ద్వారా తెలియజేశారు కార్తీకేయ. ‘దర్శకుడు టీఎన్ కృష్ణ ఇటీవల హైదరాబాద్‌కు వచ్చి నాకు కథ చెప్పాడు. తను చెప్పిన కథ అమేజింగ్‌గా ఉంది. కథ విన్న తర్వాత పిచ్చెక్కిపోయింది. ఆ సినిమా కథ విన్నప్పటి నుంచి చాలా ఉత్సాహంగా ఉన్నాను. రెండో సినిమాకు లెజెండరీ నిర్మాత కలైపులి థాను నిర్మాతగా మారడం చాలా ఆనందంగా ఉంది. భగవంతుడి దయవల్లే ఇదంతా సాధ్యమవుతున్నది’ అని కార్తీకేయ ట్విట్ చేశారు.

ఇక, ‘RX100’ సినిమా కేవలం రూ. 2.7కోట్లతో తెరకెక్కింది. ఐతే, మూడు రోజుల్లోనే పెట్టుబడి తీసుకొచ్చింది.. ఈ చిత్రం. ఇప్పటికే రూ. 15కోట్ల వరకు వసూలు చేసింది. ఇప్పటికీ ఆర్ ఎక్స్ 100 థియేటర్స్ లో హవా చూపిస్తోంది. టాలీవుడ్ లో అర్జున్ రెడ్డి తర్వాత ఆ రేంజ్ లో యూత్ ని ఆకట్టుకొన్న చిత్రంగా ఆర్ ఎక్స్ 100 పేరు తెచ్చుకొంది. త్వరలోనే ఈ సినిమా సక్సెస్ మీటుని ఏర్పాటు చేయాలని చిత్రబృంద భావిస్తున్నట్టు తెలిసింది.