కేసీఆర్ సోదరి లీలమ్మ కన్నుమూత


తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఇంట్లో విషాదం నెలకొంది. కేసీఆర్ సోదరి లీలమ్మ ఈ ఉదయం కన్నుమూశారు. ఆమె గత కొన్నాళ్లుగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. హైదరాబాద్ యశోదా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న లీలమ్మ ఈ ఉదయం మృతి చెందారు. ప్రస్తుతం ఢిల్లీ పర్యటనలో ఉన్న సీఎం కేసీఆర్ సోదరి మరణవార్తను తెలుసుకుని.. హుటాహుటిన హైదరాబాద్ కు తిరుగు ప్రయాణం అయ్యారు. ఈ యేడాది ఫిబ్రవరి 21న కేసీఆర్ మరో సోదరి విమలాబాయి కన్నుమూసిన సంగతి తెలిసిందే.