అమితాబ్‌ ఇంట్లో విషాదం


బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చబ్ ఇంటో విషాదం చోటు చేసుకొంది. అమితాబ్ వియ్యంకుడు, ఎస్కార్ట్స్‌ గ్రూప్‌ చైర్మన్‌ రాజన్‌ నందా మృతి చెందారు. దీంతో “బ్రహ్మాస్త్ర” షూటింగ్‌లో భాగంగా బల్గేరియాలో ఉన్న అమితాబ్‌ భారత్‌ కు బయలుదేరారు. ఈ విషయాన్ని అమితాబ్ తన బ్లాగ్ లో పోస్ట్ చేశారు. ‘మా బంధువు రాజన్‌ నందన్‌, నికిల్‌ తండ్రి, శ్వేత మామగారు మృతిచెందారు. భారత్‌కు బయలుదేరి వస్తున్నా’ అంటూ బిగ్‌ బి తన బ్లాగ్‌ పోస్టులో పేర్కొన్నారు. రాజన్‌ నందా కొడుకు నికిల్‌ నందాను అమితాబ్ బచ్చన్ కూతురు శ్వేతా పెళ్లి చేసుకొన్న సంగతి తెలిసిందే.