చెన్నైకి సీఎం కేసీఆర్..!

త‌మిళ‌నాడు మాజీ ముఖ్య‌మంత్రి, డీఎంకే అధినేత క‌రుణానిధి మృతిప‌ట్ల తెల‌గాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్ తీవ్ర దిగ్బ్రాంతి వ్య‌క్తం చేశారు. సుదీర్ఘ కాలం రాజ‌కీయ యోధుడిగా పేరున్న క‌రుణానిధి మృతిచెంద‌డంపై ఆయ‌న కుటుంబ స‌భ్యుల‌కు ప్ర‌గాఢ సానుభూతి వ్య‌క్తంచేశారు సీఎం. బుధ‌వారం క‌రుణానిధి అంత్య‌క్రియ‌ల‌కు హాజ‌ర‌య్యేందుకు ఆయ‌న చెన్నై వెళుతున్నారు. బుధ‌వారం ఉద‌యం చెన్నైకి బ‌య‌లుదేరి క‌రుణానిధి అంత్య‌క్రియ‌ల్లో సీఎం కేసీఆర్ పాల్గొంటారు.